గాజు సీసాలో తిరుమల శ్రీవారి ఆలయ గోపురం

Updated on: Feb 09, 2026 | 9:30 AM

మధ్యప్రదేశ్‌కు చెందిన భక్తుడు త్రిలోక్ సింధియా, తన అపారమైన భక్తిని సృజనాత్మకతతో మిళితం చేసి అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించారు. కేవలం అంగుళం వేలు పట్టని చిన్న గాజు సీసాలో, 30 రోజుల కఠోర శ్రమతో తిరుమల శ్రీవారి ఆలయ గోపురాన్ని అత్యంత సూక్ష్మంగా రూపొందించారు. చెక్క ముక్కలు, స్టిక్‌తో ఫెవికాల్‌ సాయంతో చేసిన ఈ నమూనా తిరుమల భక్తులను ఆకట్టుకుంది. గతంలో అయోధ్య రామమందిరాన్నీ ఆయన ఇలాగే నిర్మించారు.

భక్తికి సృజనాత్మకత తోడైతే అది అద్భుత కళాఖండంగా మారుతుందని మధ్యప్రదేశ్‌కు చెందిన త్రిలోక్ సిందియా అనే భక్తుడు నిరూపించారు. అంగుళం మేర కూడా వేలు వెళ్ళని ఒక చిన్న గాజు సీసాలో, తిరుమల శ్రీవారి ఆలయ గోపుర నమూనాను అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్ది అందరినీ అబ్బురపరిచారు. తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన త్రిలోక్, తను రూపొందించిన ఈ నమూనాను మీడియా ముందు ప్రదర్శించారు. కేవలం చిన్నపాటి చెక్క ముక్కలను ఉపయోగించి, ఒక స్టిక్ సాయంతో ఫెవికాల్‌తో బాటిల్ లోపల ఈ గోపురాన్ని అమర్చారు. దీనిని తయారు చేయడానికి ఆయనకు దాదాపు 30 రోజుల సమయం పట్టింది. శ్రీవేంకటేశ్వర స్వామిపై ఉన్న అపారమైన భక్తితోనే ఈ కఠినమైన పనిని సాధించగలిగానని ఆయన తెలిపారు. కేవలం తిరుమల గోపురమే కాకుండా, గతంలో అయోధ్య రామమందిరం, ఇండియా గేట్, మరియు ఎర్రకోట వంటి చారిత్రాత్మక కట్టడాలను కూడా ఆయన ఇదే తరహాలో గాజు సీసాల్లో రూపొందించారు. అత్యంత సూక్ష్మంగా, ఓపికతో ఆయన చేసిన ఈ ప్రయోగం తిరుమల వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. త్రిలోక్‌ ప్రతిభను చూసి భక్తులు మరియు స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..