అది ఏజెన్సీ ప్రాంతం.. మేత కోసం వెళ్ళింది ఆ మూగ జీవం. దారి మధ్యలో ఉన్న ఓ బావిలో పడిపోయింది. బయటకు రావాలంటే.. ముప్పై అడుగుల బావి. లోపల ఉండాలంటే ఆహారం లేదు. ఇలా రెండు రోజులు గడిచిపోయాయి. గాయాలు, ఆకలితో నిరసించి పోయింది. ఓ గ్రామాస్తుడు చూపిన చొరవతో ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడింది. భూమిపై కాలు మోపిందో లేదో బతుకు జీవుడా అంటూ లగేత్తుకెళ్లింది. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బావిలో పడి విలవిలాడుతున్న మూగజీవాన్ని రక్షించారు స్థానికులు. మూడు గంటల పాటు శ్రమించి ఆవు దూడను బయటకు తీశారు. పెదబయలు మండలం గోమంగిలో ఈ ఘటన జరిగింది. గోమంగి సరియపల్లి కాలనీలోని 30 అడుగుల లోతున్న బావి లో ఆవు దూడ పడిపోయింది. బయటకు రాలేక విలవిల్లాడిపోతుంది. గాయాలు, ఆకలి తో నిరసించి పోయింది. రెండు రోజుల పాటు అందులోనే ఉండిపోయింది. ఆ బావిలో నీరు లేకపోవడంతో తీసే వారి సహాయం కోసం ఎదురుచూసింది. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి ఆవు దూడను గుర్తించిన స్థానికులకు సమాచారమిచ్చాడు. దీంతో మూడు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. మూగజీవిని రక్షించడానికి శ్రమించిన యువకులను అభినందించారు గ్రామస్థులు. దూడకు సపర్యలు చేసి దాని యాజమానికి అప్పగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వరల్డ్ ఫస్ట్ కేసు.. ఆమె మెదడుని నిజంగానే పురుగు తొలిచేస్తోంది
శభాష్.. ఇది కదా ట్యాలెంట్ అంటే.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
ఆ టీచర్లు పెడితే కానీ ఆహారం ముట్టని పక్షులు !!
రెండు బరువైన దుంగలను మోసుకెళ్తున్న యువతి !! రియల్ బాహుబలి అంటున్న నెటిజన్లు
మూడు గంటలపాటు కాలుపైనే పాము !! ఆ మహిళ ఏంచేసిందంటే ??