జస్ట్ మిస్.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ

Updated on: Sep 19, 2025 | 7:46 PM

ఉత్తరాఖండ్‌లో వర్షాలు వరదల ప్రభావం కొనసాగుతోంది. ఈ క్రమంలో గర్‌హ్వాల్‌ బీజేపీ ఎంపీ అనిల్ బలూనీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ఉన్న ఆయన బద్రీనాథ్‌ జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎంపీతోపాటు, ఆయన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తన ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా విపత్తు ప్రభావిత ప్రాంతాలైన చమోలీ, రుద్రప్రయాగ్‌లో పర్యటించిన అనంతరం బలూనీ .. రిషికేశ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో దేవప్రయాగ్ సమీపంలో కొండచరియలు విరిగిపడటాన్ని గమనించి.. వెంటనే కారు దిగి, సిబ్బందిని, ఇతరులను అలర్ట్‌ చేశారు. అయితే.. చూస్తుండగానే అక్కడి పర్వతం నుంచి భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఆ ప్రాంతమంతా బండ రాళ్లు, మట్టితో నిండిపోయింది. దీంతో.. వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ భయానక అనుభవాన్ని బలూనీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం తనకు ఎదురైన అనుభవాన్ని బట్టి.. తమ రాష్ట్రం ఎంతటి ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటోందో ఈ వీడియో చెబుతోందని పోస్టులో చెప్పుకొచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సేవలను ఆయన ప్రశంసించారు. ఉత్తరాఖండ్ వరుస ప్రకృతి విపత్తులతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా అనేక జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం నందా నగర్‌లోని కుంటారీ, ధుర్మా ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా దాదాపు 10 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జేసీబీల సాయంతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీఎం చెప్పారు.. బుల్లెట్‌ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్‌ న్యాయం

మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియోపై ఆర్టీసీ రియాక్షన్

త్వరలోనే భారత్‌లో 6 జీ సేవలు.. హైదరాబాద్ ఐఐటీది కీలక పాత్ర

ఆర్టీసీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకే

TOP 9 ET News: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి మైండ్‌ షేక్‌ డీల్