ఆ జిల్లాల పరివాహకంలో ఏడాదిపాటు శుభకార్యాలు బంద్

Updated on: Mar 11, 2026 | 1:18 PM

గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. పుష్కరాల ఏడాది శుభకార్యాలు జరపకూడదన్న అనాదిగా వస్తున్న సంప్రదాయంతో, 2026 గోదావరి పుష్కరాలకు ముందే వివాహాలు పూర్తి చేసేందుకు తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. అయితే, ఈ నిబంధన నది తీర ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుందని కొందరు సిద్ధాంతులు చెబుతున్నారు.

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో పెళ్లిళ్ల సందడి నెలకొంది. పుష్కరాల ఏడాదిలో శుభకార్యాలు నిర్వహించకూడదనే అనాదిగా వస్తున్న నమ్మకం దీనికి కారణం. 12 ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు 2026 జూన్ 26న ప్రారంభమవుతాయి. ఈ సమయంలో చనిపోయిన పూర్వీకులకు పిండ ప్రదానాలు, దాన ధర్మాలు చేస్తారు కాబట్టి, ఏడాదిపాటు వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: అప్పట్లో మా తాత.. ఇప్పుడు నేను.. చాలా సంతోషంగా ఉంది

ట్రంప్‌.. ఆ చిన్నారుల కళ్లల్లోకి చూడు.. ఇరాన్ లో మరణించిన బాలల ఫోటోలు విడుదల

ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’ యాక్టివ్‌.. అమెరికాపై దాడులకు కుట్ర ??

బెంజ్‌ కార్లలో తరలింపు.. దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు.. అండగా ఎన్నారైలు

కులాంతర వివాహమే ఆమె పాలిట శాపమైందా !!

Follow Us