కుర్చీ మడతబెట్టి కొడితే 700 మిలియన్లు వీడియో
గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాట యూట్యూబ్లో 700 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. కేవలం 20 నెలల్లో ఈ మైలురాయిని చేరుకుంది. తెలుగు పాటలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్నాయని ఇది నిరూపిస్తోంది. బుట్టబొమ్మ, రాములో రాములా వంటి పాటలు కూడా వందల మిలియన్ల వ్యూస్తో దూసుకుపోతున్నాయి.
తెలుగు పాటలు ప్రస్తుతం యూట్యూబ్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గతంలో హిందీ, ఇంగ్లీష్ పాటలకు మాత్రమే వందల మిలియన్ల వ్యూస్ వస్తాయని భావించేవారు. కానీ ఇప్పుడు తెలుగు పాటలు కూడా ఈ ట్రెండ్ను మార్చాయి. తాజాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి పాట యూట్యూబ్లో 700 మిలియన్ల వ్యూస్ను సాధించింది. విడుదలైన 20 నెలల్లోనే ఈ రికార్డును చేరుకోవడం విశేషం.కుర్చీ మడతబెట్టి కంటే ముందు తెలుగులో 500 మిలియన్ల వ్యూస్ దాటిన పాటలు రెండు మాత్రమే ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
