ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

Updated on: Jan 22, 2026 | 9:11 PM

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా భోజ్‌శాల ఆలయం వివాదంపై సుప్రీంకోర్టు జనవరి 22, 2026న కీలక తీర్పు ఇచ్చింది. వసంత పంచమి రోజున హిందువులు పూజలు, ముస్లింలు నమాజ్‌లు ఒకేచోట చేసుకునేందుకు అనుమతించింది. హిందువులకు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, ముస్లింలకు మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి సమయం కేటాయించింది.

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా భోజ్‌శాల ఆలయం వివాదంపై సుప్రీంకోర్టు ఒక సంచలన, కీలక తీర్పు వెలువరించింది. జనవరి 22, 2026న ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం, వసంత పంచమి వేడుకలు, శుక్రవారం నమాజ్ ఒకేరోజు రావడంతో, భోజ్‌శాల ప్రాంగణంలో హిందువులు, ముస్లింలు ఇద్దరూ ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి లభించింది. ముఖ్య న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హిందువులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పూజలు నిర్వహించుకోవడానికి అనుమతించగా, ముస్లింలు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవడానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

ట్రాఫిక్‌ చలాన్ల బలవంతపు వసూళ్లకు చెక్‌.. హైకోర్ట్‌ కీలక ఆదేశాలు

Loading...
Unable to load recommendations.
Follow Us