గంభీర్ ఇంట్లో స్పెషల్ డిన్నర్.. స్పెషల్ లుక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
టీమిండియా ఆటగాళ్ల ప్రైవేట్ లైఫ్స్టైల్స్ గురించి వారి అభిమానులు ఎంతో అతృతగా సెర్చ్ చేస్తుంటారు. మైదానంలో బాల్, బ్యాట్తో అలరించే ఆటగాళ్లు బయట ఎలా ఉంటారు? అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అందుకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే ఆటగాళ్లకు సంబంధించిన ఏ చిన్న అంశమైనా ఇట్లే వైరల్ అవుతూ ఉంటుంది.
అలాంటి అందరు ఆటగాళ్లూ ఒకే చోట చేరి సందడి చేస్తే ఇక ఫ్యాన్స్కు పండగే కదా. వెస్టిండీస్తో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్కు ముందు టీమిండియా క్రికెటర్లు, సహాయక సిబ్బందికి ఆ జట్టు హెడ్ కోచ్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూఢిల్లీలోని తన నివాసంలో బుధవారం రాత్రి ఓ ప్రత్యేక విందు ఇచ్చారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆటగాళ్ళ మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచడానికి, ఉల్లాసంగా గడపడానికి గంభీర్ ఈ విందు ఏర్పాటు చేశారు. గంభీర్ నివాసానికి భారత జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ మొత్తం ఒక బస్సులో వచ్చారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ సహా ఆటగాళ్లంతా సాధారణ దుస్తుల్లో కనిపించారు. గిల్ టీ-షర్ట్, బ్లూ డెనిమ్తో స్టైలిష్గా ఉండగా, జస్ప్రీత్ బుమ్రా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వంటి చాలా మంది ఆటగాళ్లు తెల్లటి దుస్తుల్లో వచ్చారు. సహాయక సిబ్బందితో పాటు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఈ ప్రత్యేక విందుకు హాజరయ్యారు. రెండు టెస్టుల సిరీస్లో భారత్ ఇప్పటికే అహ్మదాబాద్లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో చిత్తు చేసి 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ ఉల్లాసకరమైన వాతావరణం రెండో టెస్టుకు ముందు ఆటగాళ్లకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ విందు ద్వారా ఆటగాళ్ల మధ్య బంధం మరింత బలపడి, మైదానంలో జట్టుగా మరింత మెరుగ్గా రాణించడానికి తోడ్పడుతుందని గంభీర్ ఆశించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mass Jathara: మాస్ జాతర పై బాహుబలి ప్రభావం ఎంత
Pooja Hegde: రీ ఎంట్రీ కోసం పూజా హెగ్డే తంటాలు
Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్
