Andhra: ఆవురావురుమని బిర్యానీ లాగించేద్దామనుకున్నాడు.. తీరా ఒక్క ముద్ద తినేసరికి

Updated on: Oct 16, 2025 | 1:59 PM

బిర్యానీ తినదామని ఆవురావురుమని కూర్చున్నాడు. తీరా ఒక ముద్ద నోట్లో పెట్టుకునేసరికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఈ ఘటన కోనసీమ జిల్లా లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ స్టోరీ పై ఓ సారి లుక్కేయండి మరి.

కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ రెస్టారెంట్ లో చికెన్‌ బిర్యానీలో పెద్ద తేలు వచ్చింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. తేలు ఉన్న బిర్యాని తిని ఒక యువకుడు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించలేదు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఘటనపై ఎలాంటి పిర్యాదు అందలేదని చెబుతున్నారు పోలీసులు. విషయం బయటకు రావడంతో అధికారులకు లంచాలు ఇచ్చి కేసు లేకుండా చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇది చదవండి: 

మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

Published on: Oct 16, 2025 01:58 PM