విశాఖలో ట్రావెల్స్ బస్సులపై RTA స్పెషల్ డ్రైవ్

Updated on: Oct 02, 2025 | 4:55 PM

విశాఖలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై RTA అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. అధిక ధరలకు టికెట్లు విక్రయించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. అగనంపూడి హైవేపై జరిగిన తనిఖీలలో ఇప్పటివరకు 44 బస్సులపై కేసులు నమోదు చేసి, నాలుగు లక్షల రూపాయల జరిమానా విధించారు. ఒడిశా, తమిళనాడుకు చెందిన పలు బస్సులను అధికారులు సీజ్ చేశారు.

విశాఖపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రోడ్డు రవాణా సంస్థ (RTA) అధికారులు ప్రత్యేక దాడులు చేపట్టారు. పండుగల వేళ అధిక ధరలకు టికెట్లు విక్రయించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటి ఉల్లంఘనలపై అధికారులు దృష్టి సారించారు. అగనంపూడి హైవేపై తనిఖీలు నిర్వహించిన అధికారులు ప్రయాణికుల సంఖ్యను, టికెట్ల ధరలను పరిశీలించారు. నిబంధనలు అతిక్రమించిన బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని RTA అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ డివైన్ మ్యూజిక్ సర్టిఫికేట్ కోర్స్

అరసవల్లిలో అద్భుత దృశ్యం.. మూల విరాట్టును తాకిన సూర్యకిరణాలు

అక్టోబర్‌ 1 నుంచి మారిన రూల్స్‌ ఇవే

పైరసీపై ఉక్కుపాదం.. స్ట్రాంగ్ వార్నింగ్..!

బీసీసీఐ ముందు తలవంచిన పీసీబీ చీఫ్

Loading...
Unable to load recommendations.
Follow Us