Telangana: చెక్ పోస్ట్ తనిఖీల్లో ఆగిన కారు.. లోపలున్న బ్యాగ్ చెక్ చేయగా కళ్లు జిగేల్.!

|

Mar 26, 2024 | 9:24 PM

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తెలంగాణ అంతటా ముమ్మరంగా వాహనాల చెకింగ్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి.. పోలీసులు ప్రతీ ఒక్కరి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరో రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. ఈ స్టోరీ చూసేయండి..

ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో తెలంగాణ అంతటా ముమ్మరంగా వాహనాల చెకింగ్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టి.. పోలీసులు ప్రతీ ఒక్కరి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరో రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఎలాంటి ఆధారాలు, సంబంధిత పత్రాలు లేని నగదు.. అక్రమ మద్యం దొరికినా.. వాటిని సీజ్ చేసి.. గ్రీవెన్స్ సెల్‌లో డిపాజిట్ చేస్తున్నారు ఖాకీలు. ఈ క్రమంలోనే సరైన డాక్యుమెంట్స్ లేకుండా దొరికిన రూ. 2 లక్షల నగదును సీజ్ చేశారు ఖానాపూర్ పోలీసులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని బాధన్‌కుర్తి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలో భాగంగా కారులో రెండు లక్షల రూపాయలు నగదు పట్టుకున్నారు ఐటీ అధికారులు. వాహనంలో ఈ డబ్బును భూపాలపల్లి నుంచి నేరడిగొండ తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Follow us on