భారత్ ను అవమానిస్తే ఊరుకోం.. అమెరికాకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ వీడియో
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ను అవమానిస్తే సహించబోమని, రష్యాతో చమురు వాణిజ్యంపై అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీని ప్రశంసించిన పుతిన్, భారత్-రష్యా వ్యూహాత్మక బంధం కొనసాగుతుందని తెలిపారు. ఆయన త్వరలో ఢిల్లీ పర్యటనకు రానున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు తీవ్ర హెచ్చరిక చేశారు. రష్యాతో భారత్, చైనా సంబంధాలను తెంచే ప్రయత్నాలు చేస్తే అది బ్యాక్ఫైర్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ను అవమానిస్తే ఊరుకునేది లేదని అమెరికాకు పుతిన్ గట్టిగా చెప్పారు. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గదని పుతిన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విజ్ఞత ఉన్న నాయకుడిగా ప్రశంసించారు. భారత్-రష్యా మధ్య భాగస్వామ్యం కొనసాగుతుందని పుతిన్ పునరుద్ఘాటించారు. అమెరికా “దొంగ వేషాలు” వేస్తోందని ఆరోపించిన పుతిన్, ఇండియా ఎవరికీ తలవంచదని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
