సైబర్ నేరగాళ్ల మాయలో రిటైర్డ్ ఎంప్లాయ్.. రూ. కోటి 23లక్షల స్వాహా..!!
ప్రకాశం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కోటి 23 లక్షల రూపాయలు సైబర్ మోసగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ మాజీ అధికారి నాగేశ్వరరావును మోసం చేశారు. అద్దంకిలో ఫిర్యాదు నమోదు కాగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్ల మోసాలకు ఒక రిటైర్డ్ ఉద్యోగి కోటి 23 లక్షల రూపాయలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. అద్దంకికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ అధికారి నాగేశ్వరరావు ఈ ఘరానా మోసానికి గురయ్యారు. గతంలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్లో లోన్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేసిన ఆయన విధులలో అక్రమాలు జరిగాయని, దీనిపై కేసు నమోదైందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి నమ్మించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆయనను, ఆయన భార్యను అరెస్టు చేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. వీడియో కాల్ ద్వారా ఇంటి శోధన చేస్తామని నమ్మించి, బీరువాలోని షేర్ మార్కెట్ డాక్యుమెంట్లను కూడా క్యాప్సిల్ చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పడవ పందేల ట్రయల్ రన్ లో అపశృతి
Naa Anveshana: అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
