జగన్‌ను దెబ్బతీయటానికే లడ్డూ వివాదం లేపారు

Updated on: Jan 30, 2026 | 9:59 PM

వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయటానికే లడ్డూ వివాదం సృష్టించారని ఆయన ఆరోపించారు. సీబీఐ, సిట్ విచారణలో లడ్డూలో జంతుకొవ్వు లేదని, రాజకీయ ప్రమేయం లేదని తేలిందని భూమన తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల వల్ల ఏర్పడిన నింద పోవాలని ఈ హోమం చేస్తున్నామన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించారు. ఈ హోమాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు 50 మంది అర్చకులతో కలిసి చేపట్టారు. గతంలో తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, ఈ వివాదం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయటానికే సృష్టించబడిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ, సిట్ విచారణలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా తేలిందని భూమన గుర్తుచేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాక్‌పిట్‌లో హాహాకారాలు దొరికిన బ్లాక్‌బాక్స్‌.. ఆఖరి 11 నిమిషాల గుట్టు రట్టు ?

మోమోస్‌ షాపులో అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Gold Price: పసిడి పరుగులకు బ్రేక్.. ఒక్క రోజులోనే భారీ క్షీణత

Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు

కలచివేస్తున్న నాంపల్లి అగ్నిప్రమాద బాధితుల ఆఖరి ఆడియో

Loading...
Unable to load recommendations.
Follow Us