గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్నగర్జిల్లా కేంద్రంలో పర్యటించననున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా పరిధిలోని భూత్పూర్ దారిలో ఉన్న నూతన సమీకృత కార్యాలయాల భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే వివిధ రకాల పనుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎంవీఎస్ కళాశాల ఆవరణలో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పాలమూరు పట్టణం కొత్త శోభ సంతరించుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..