Janasena: వచ్చేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే : పవన్

|

Dec 02, 2023 | 3:19 PM

జాతీయ స్థాయిలో చర్చించేలా జనసేనపార్టీని బలోపేతం చేశామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. అన్ని కులాలను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు పవన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకోసం కేటాయించిన నిధులను వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలో పవన్‌ సమక్షంలో తూర్పుగోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లా నాయకులు జనసేనలో చేరారు.

జాతీయ స్థాయిలో చర్చించేలా జనసేనపార్టీని బలోపేతం చేశామన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌. అన్ని కులాలను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు పవన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులకోసం కేటాయించిన నిధులను వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలో పవన్‌ సమక్షంలో తూర్పుగోదావరి, కడప, కృష్ణా, శ్రీకాకుళం జిల్లా నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్‌ రెండు భావజాలాల మధ్య ఉన్నవారిని ఒక తాటిపైకి తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. జగన్‌ పాలనలో ఏపీలో అధ్వాన్న పరిస్థితులున్నాయన్నారు పవన్‌. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీకి పరిశ్రమలు రావన్నారు పవన్‌. 2024లో ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు పవన్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on