YSRCP: జగన్‌పై జరిగింది పక్కాగా హత్యాయత్నమే: సజ్జల

Updated on: Apr 14, 2024 | 1:01 PM

సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదు.. ఎయిర్‌ గన్‌తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. జగన్‌ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్‌తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అది మరో చోట తగిలి ఉంటే ప్రమాదం ఊహాకే అంది ఉండేది కాదంటోంది.

జగన్‌పై జరిగింది పక్కాగా హత్యాయత్నం అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. దాడిలో.. కొద్దిగా అటూ ఇటూ అయితే జగన్ ప్రాణానికే ప్రమాదం జరిగేదని చెప్పారు. 2019లో.. ఇప్పుడు.. అదృష్టం కొద్ది జగన్ ప్రాణాలతో బయటపడ్డారన్నారు సజ్జల.

సీఎం జగన్‌పై దాడి నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు. జగన్‌పై జరిగింది రాళ్ల దాడి కాదు.. ఎయిర్‌ గన్‌తో కాల్చారని అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. జగన్‌ కణతకు గురిపెట్టి షార్ప్ షూటర్‌తో టీడీపీ హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపిస్తోంది. అది మరో చోట తగిలి ఉంటే ప్రమాదం ఊహాకే అంది ఉండేది కాదంటోంది. దాడి వెనుక చంద్రబాబు ఉండొచ్చని అనుమానం ఉందంటోంది. ఘటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని కోరుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Loading...
Unable to load recommendations.
Follow Us