YCP vs Janasena: వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్.. విశాఖ తీరాన పోటాపోటీగా వెలుస్తున్న ఫ్లెక్స్ లు.

|

May 29, 2023 | 4:58 PM

విశాఖ నగరంలో జనసేన, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజుకుని ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సత్యం కూడలిలో వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదివారం నిరసనకు దిగారు..

ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాటుపడుతున్నారు. అందుకోసం పొత్తులకు కూడా సిద్ధమవుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా, సీఎం జగన్‌పై, వైసీపీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ బలం రాష్ట్రంలో 18 శాతం పెరిగిందని ఇటీవల పవన్ కల్యాణ్ అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ బలం 30 నుంచి 35 శాతం ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి ఎవరూ అనే దానిపై ఎన్నికల తర్వాత నిర్ణయించాల్సిన విషయమని.. దీని గురించి కాకుండా ఎన్నికల్లో పార్టీని బలంగా నిలబెట్టడం ముఖ్యమని ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us on