Watch Video: ‘పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు’: పొచారం శ్రీనివాస్ రెడ్డి..

|

Mar 29, 2024 | 5:08 PM

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పోచారం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. 'పార్టీ నుంచి చెత్త అంతా పోయింది.. గట్టి వాళ్లే మిగిలారని' సంచలన వ్యాఖ్యలు చేశారు.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి పోచారం శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ‘పార్టీ నుంచి చెత్త అంతా పోయింది.. గట్టి వాళ్లే మిగిలారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్న వారిని ఉద్ధేశించి అన్నట్లుగా తెలుస్తోంది. పదవులు, అధికారం, వ్యాపారాల కోసం వచ్చిన స్వార్ధపరులే పార్టీ మారుతున్నారని ఆరోపించారు.

మోసకారుల లిస్ట్ రాస్తే మొదటి పేరు బిబీ పాటిల్ దే అని విమర్శలు చేశారు. మొదటి నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10సంవత్సరాలు అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు 100 చెప్పొచ్చు. ఇదే క్రమంలో బీజేపీ అమలు చేసిన ఒక్క సంక్షేమ పథకం చెప్పండని సవాల్ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on