కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా AP ప్రభుత్వం అడుగులు

Updated on: Nov 27, 2025 | 6:45 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలోని కేశనపల్లిలో కొబ్బరి రైతుల సమస్యలను పరిశీలించారు. శంకర్ గుప్తం డ్రైన్ వల్ల పాడైన తోటలను చూసి, రైతుల కష్టాలను తెలుసుకున్నారు. కోకోనట్ బోర్డు ఏర్పాటు, సమస్యపై కమిటీ, 45 రోజుల్లో యాక్షన్ ప్లాన్, డ్రైన్ పరిష్కారానికి ₹22 కోట్ల నిధులు వంటి హామీలు ఇచ్చారు. ఇది రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా తొలి అడుగు.

ఏపీ ప్రభుత్వం కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేశనపల్లిలో మోడు బారిపోతున్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు. శంకర్ గుప్తం డ్రైన్ వల్ల ఉప్పు నీరు చేరి, కొబ్బరి చెట్లు పాడైపోతున్నాయని గుర్తించారు. ఈ సమస్యతో 13 గ్రామాల రైతులు సతమతమవుతున్నారు. పవన్ కళ్యాణ్ 13 గ్రామాల కొబ్బరి తోటల రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి కష్టాలను విన్నారు. కోకోనట్ బోర్డు ఏర్పాటుపై క్యాబినెట్‌లో చర్చిస్తామని, కొబ్బరి రైతుల సమస్యపై కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ యాటిట్యూడ్‌ను మీ జేబులోనే పెట్టుకోండి.. క్యాబ్ డ్రైవర్ రూల్స్ వైరల్

ఆరు శతాబ్దాల మహావృక్షం చరిత్ర.. ఇది ఒక ఆధ్యాత్మిక అద్భుతం

ఫోన్‌‌లో మాటలు విన్నాడు.. మనసు గెలిచాడు

తిరుపతి మీదుగా దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు.. హైదరాబాద్ నుంచి రెండు గంటల్లోనే చెన్నైకి

Andhra Pradesh: ఏపీలో స్మార్ట్‌ కార్డ్‌.. ఆధార్‌ను మించి..

Loading...
Unable to load recommendations.
Follow Us