AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న CM చంద్రబాబు దుబాయ్ టూర్

పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న CM చంద్రబాబు దుబాయ్ టూర్

Phani CH
|

Updated on: Oct 23, 2025 | 8:11 PM

Share

సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించారు. శోభా గ్రూప్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్‌వరల్డ్, బుర్జీల్ హెల్త్ కేర్‌తో భేటీ అయ్యారు. లాజిస్టిక్స్, క్యాన్సర్ సెంటర్, ఐటీ పార్కులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులలో పెట్టుబడులకు ఆసక్తి వ్యక్తమైంది. రాష్ట్ర అభివృద్ధికి, భవిష్యత్ ఎన్నికల విజయానికి పాలన కీలకమని సీఎం అన్నారు.

యూఏఈలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. మొదటి రోజు పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. శోభా గ్రూప్, షరాఫ్ గ్రూప్, ట్రాన్స్‌వరల్డ్, బుర్జీల్ హెల్త్ కేర్ వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా, లాజిస్టిక్స్, గిడ్డంగుల ఏర్పాటుకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి చూపింది. దుగ్గరాజపట్నం నౌకా కేంద్రంలో పెట్టుబడులకు ట్రాన్స్‌వరల్డ్ ముందుకు వచ్చింది. తిరుపతిలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జీల్ హెల్త్ కేర్ అంగీకారం తెలిపింది. అమరావతి, తిరుపతి, విశాఖపట్నంలో ఐటీ పార్కులు, మాల్స్, హోటల్స్, గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు శోభా గ్రూప్ ఆసక్తి కనబరిచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రచ్చకెక్కిన రివ్యూలు, రేటింగ్ ల వ్యవహారం

30ల్లోకి రాకముందే సీనియర్లు అయ్యారుగా

OG నా సినిమాకు కాపీ.. ఆ దర్శకుడి సంచలన ఆరోపణ

ఎన్టీఆర్ – నీల్ సినిమా ఆగిపోయిందా ??

అందాల భామలకు తలనొప్పిగా మారిన రూమర్స్‌..