టాలీవుడ్ లో అగ్రనటుల మధ్య మొదలైన చిన్నపాటి యుద్ధం

Updated on: Sep 26, 2025 | 7:52 PM

టాలీవుడ్ అగ్రతారలు చిరంజీవి, బాలకృష్ణల మధ్య అసెంబ్లీ సాక్షిగా రాజుకున్న వివాదం కలకలం రేపింది. గత ప్రభుత్వంలో చిరంజీవికి జరిగిన అవమానంపై కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. చిరంజీవి నిలదీయడం వల్లే జగన్ దిగివచ్చారనేది అబద్ధమని బాలకృష్ణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో తనకు గౌరవం దక్కడం లేదని కూడా ఆయన పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో అగ్రతారలుగా వెలుగొందుతున్న చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చిన్నపాటి వివాదం మొదలైంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదని, రాజకీయాల్లోనూ ఈ ప్రభావం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖులు కలిసినప్పుడు చిరంజీవికి జరిగిన అవమానంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చారన్న కామినేని మాటలను బాలకృష్ణ తీవ్రంగా ఖండించారు. చిరంజీవి నిలదీయడం అబద్ధమని, అక్కడ ఎవరూ గట్టిగా అడగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి వెంటనే పత్రికా ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీ అభిమానం బంగారం కాను.. గోల్డ్ మొబైల్ కవర్ పై బంగారంతో కోహ్లీ ఫొటో

దీపావళి వేళ వినియోగదారులకు ఫోన్‌ పే బంపర్‌ ఆఫర్‌

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

రెహమాన్‌ పాట శివస్తుతి కాపీనా ?? కోర్టు ఏం చెప్పిందంటే

గంగమ్మ ఎండిపోతోందా? ఎందుకిలా!

Loading...
Unable to load recommendations.
Follow Us