KTR: కేసీఆర్ ను తిట్టుడు తప్ప రెండేళ్లలో రేవంత్ చేసిందేంటి

Updated on: Feb 09, 2026 | 4:22 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లి మున్సిపల్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్‌కి పాలన చేతకాదని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్రను ప్రశ్నించి, లక్కీ డ్రాలో సీఎం అయ్యారని ఆరోపించారు. రెండేళ్లలో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.

భూపాలపల్లి మున్సిపల్ ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప రేవంత్‌కి పాలన చేతకాదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి అసలు ఎక్కడున్నారు అని ప్రశ్నించిన కేటీఆర్, ఉద్యమ సమయంలో ఆయన చంద్రబాబు సంచులు మోశారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్రోకర్ పనులు చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లక్కీ డ్రాలో సీఎం అయ్యారని, కానీ రెండేళ్ల తర్వాత మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని కేటీఆర్ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబటిపై బిగుస్తున్న ఉచ్చు! గుంటూరు కోర్టులో నేడు కీలక పరిణామాలు

PM Modi: మంచి నిద్ర ఉండాలి.. అప్పుడే ఎనర్జీ ఉంటుంది

CM Chandrababu Naidu: సూపర్ 6 సక్సెస్! ప్రతి ఇంటికీ పథకం

Auto News: కొత్త కారుపై రూ.1,48,000 వరకు తగ్గింపు! ఈ 3 కార్లపై భారీ డిస్కౌంట్లు

డ్రాగన్ నయా అస్త్రం.. ఇక శత్రు ఉపగ్రహాలకు చుక్కలే

Loading...
Unable to load recommendations.
Follow Us