Telangana: వచ్చే ఎన్నికల్లో విజయం బీజేపీదే : ఈటల రాజేందర్

|

Dec 09, 2023 | 4:54 PM

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదే అని చెప్పారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ క్వీన్‌స్వీప్‌ చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ గతంలో కంటే మెరుగుపడిందని చెప్పారు. 2018లో ఒక సీటు గెలిచి..6 శాతం ఓట్లను సాధించగా... ఈ దఫా 8 స్థానాలు గెలిచి..15% ఓట్ల షేర్‌‌తో 36 లక్షల ఓట్లు సాధించినట్లు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదే అని చెప్పారు బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ క్వీన్‌స్వీప్‌ చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ గతంలో కంటే మెరుగుపడిందని చెప్పారు. 2018లో ఒక సీటు గెలిచి..6 శాతం ఓట్లను సాధించగా… ఈ దఫా 8 స్థానాలు గెలిచి..15% ఓట్ షేర్‌‌తో 36 లక్షల ఓట్లు సాధించినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాల్లో రెండో స్థానం.. 46 స్థానాల్లో డిపాజిట్‌ సాధించినట్లు వెల్లడించారు.

కాగా ఈ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఈటల పరాజయం చవిచూశారు. తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌తో పాటు గత సీఎం కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ ఈటల రాజేందర్‌ను ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసిన విజయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Follow us on