తెలంగాణలో సంచలనంగా మారిన పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో సరికొత్త ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. అటు సిట్ విచారణలో స్పీడు పెంచుతుంటే.. అటు రాజకీయంగా నేతలు విమర్శల హీట్ పెంచుతున్నారు. హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుండగా.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామంటున్నారు BSP నాయకులు. CBI విచారణకు ఆదేశించాలని కొందరు డిమాండ్ చేస్తే.. సిట్టింగ్ జడ్జి ద్వారానే విచారణ జరగాల్సిందే అంటున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. TSPSCలో జరిగిన అక్రమాలకు తనకేం సంబంధమని కేటీఆర్ ఇటీవల చేసిన విమర్శలకు ఖచ్చితంగా ఐటీ మంత్రి బాధ్యత వహించాల్సిందే అంటూ కాంగ్రెస్ లెక్కలేసి మరీ చెబుతోంది.