AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: కాషాయమయమైన భాగ్యనగరం.. ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో

PM Modi: కాషాయమయమైన భాగ్యనగరం.. ప్రధాని మోదీ ప్రసంగం.. లైవ్ వీడియో

Shaik Madar Saheb
|

Updated on: May 10, 2026 | 4:58 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ నగరమంతా కాషాయ తోరణాలు, బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేసింది. ఈ క్రమంలోనే.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమం తర్వాత.. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీకి గెలిచిన సుమారు వంద మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్వాగతం పలకనున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను తెలంగాణ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ నగరమంతా కాషాయ తోరణాలు, బీజేపీ ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేసింది. ఈ క్రమంలోనే.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ కార్యక్రమం తర్వాత.. సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీకి గెలిచిన సుమారు వంద మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో స్వాగతం పలకనున్నారు. పరేడ్‌ గ్రౌండ్‌ సభలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు మాట్లాడిన తర్వాత.. ప్రధాని మోదీ సుమారు 40నిమిషాలు ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇక.. ప్రధాని మోదీ టూర్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2వేల 500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముగ్గురు DCPలు, ఐదుగురు అదనపు DCPలు, 21మంది ACPలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్స్‌, స్నిఫర్ డాగ్స్, ఆక్టోపస్‌, SOT బృందాలతో తనిఖీలు చేపట్టారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో సీసీటీవీ నిఘాను కట్టుదిట్టం చేశారు. అన్ని ప్రవేశ ద్వారాల దగ్గర స్క్రీనింగ్ తప్పనిసరి చేశారు. బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పరిధిలో డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్ల ప్రదర్శనపై నిషేధం విధించారు.

Published on: May 10, 2026 04:56 PM
Follow Us