Sabarimala: శబరిమల బంగారం అంశంలో మరో ట్విస్టు

Updated on: Oct 10, 2025 | 11:00 PM

శబరిమల బంగారు పూత వివాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. గర్భగుడిలో ఉండాల్సిన పురాతన యోగదండం, దశాబ్దాల నాటి రుద్రాక్షమాల అదృశ్యమయ్యాయి. 2018లో బంగారు పూత కోసం తీసుకెళ్లినప్పటికీ, వాటిని తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. హైకోర్టు అనుమతి లేకుండానే ఈ వస్తువులను తరలించారని, వాటికి సంబంధించిన రికార్డులు లేవని ఆలయ సభ్యులు వెల్లడిస్తున్నారు. దేవస్థానం బోర్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

శబరిమల బంగారం వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. శబరిమల ఆలయ గర్భగుడిలో ఉండే అత్యంత పురాతన యోగదండం, దశాబ్దాల నాటి రుద్రాక్షమాల అదృశ్యమైనట్లు వెల్లడైంది. 2018లో ఈ వస్తువులను బంగారు పూత పూయించడానికి తరలించినప్పటికీ, అవి తిరిగి ఆలయానికి చేరలేదని సమాచారం. ఆలయ బోర్డు సభ్యుల కథనం ప్రకారం, యోగదండం బంగారు పూత కోసం తీసుకెళ్లిన తర్వాత, కొత్త యోగదండం వచ్చినప్పటికీ పాతది మాయమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్‌

వైరల్ అవుతున్న మెగాస్టార్‌ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా

మాట మార్చిన మహేష్‌.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్

కర్ణాటక Vs రష్మిక.. ఈ వివాదానికి ముగింపే లేదా

వెండితెరకు ముప్పు.. ఓటీటీల పెత్తనానికి చెక్‌ పెట్టేదెవరు