45 ఏళ్ల వేడుకలు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమాన్ని సందర్శించిన ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీ

Updated on: May 20, 2026 | 10:32 AM

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ బెంగళూరులోని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడికి వచ్చిన అంబానీ ఆయన కుమారు సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను కలుసుకున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ బెంగళూరులోని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడికి వచ్చిన అంబానీ ఆయన కుమారు సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్‌ను కలుసుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అక్కడే కాసేపు గడిపి ముకేష్‌ అంబానీ ఆయన కుమారుడు ఆశ్రమ విశేషాలను, అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, అంబానీ ఆధ్యాత్మికతకు, భారతీయ సంస్కృతికి ఇచ్చే ప్రాధాన్యతను ఈ పర్యటన మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: May 20, 2026 10:31 AM
Follow Us