పల్లీలుగా పిలవబడే వేరుశెనగలు గుండెజబ్జులను దూరం చేస్తాయట. జపాన్లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు. వేరుశెనగలు అధికంగా తినే ఆసియా ప్రజలు గుండె జబ్బుల ప్రమాదం నుంచి దూరంగా ఉంటారని పరిశోధనల్లో తేలిందట. జపాన్లో నివసిస్తున్న ఆసియా మహిళలు, పురుషులు రోజూ వేరుశెనగలు తినటం వల్ల వారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.