వ్యక్తిని చంపేసి, భార్యగా నటించి.. ఆపైన వీడియో
కర్ణాటకలో ఐదు కోట్ల ఇన్సూరెన్స్ కోసం ఓ ముఠా ఘోరమైన పథకం పన్నింది. పక్షవాతంతో బాధపడుతున్న గంగాధర్ అనే వ్యక్తిని హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. ముఠాలోని ఓ మహిళ చనిపోయిన వ్యక్తి భార్యనని నటించి భీమా క్లెయిమ్ చేయగా, అసలు భార్య శారదమ్మ అనుమానంతో ఈ కుట్ర బట్టబయలైంది. పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు.
మానవత్వం నశించిపోతున్న ఈ కాలంలో మనిషి తన స్వార్థం కోసం ఎంతటి నేరాలకైనా వెనుకాడటం లేదు. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన దీనికి నిదర్శనం. హోస్పేటకు చెందిన గంగాధర్ తన పేరు మీద ఐదు కోట్ల రూపాయలకు భీమా చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు వ్యక్తులు గంగాధర్ను చంపి ఇ న్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని పన్నాగం పన్నారు.పథకం ప్రకారం, అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ను హత్య చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని శివారుల్లోకి తీసుకెళ్లి, టీవీఎస్ స్కూటర్పై కూర్చోబెట్టి కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ముఠాలోని ఓ మహిళ తాను గంగాధర్ భార్యనని చెప్పుకుంటూ భీమా డబ్బుల కోసం ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించింది.
మరిన్ని వీడియోల కోసం :
