రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 2వేల569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్ము & శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం ఆర్ఆర్బీ రీజియన్లతో ఆ పోస్టులను భర్తీ చేయనుంది. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి తప్పనిసరిగా 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 ఆన్లైన్ రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం 100 మార్కులకు 100 అబ్జెక్టీవ్ ప్రశ్నలకు ఈ పరీక్ష ఉంటుంది. గణితం నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కులు, జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలకు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 15 ప్రశ్నలకు 15 మార్కులు, జనరల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల చొప్పున ప్రశ్నలు వస్తాయి. వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కుల కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2 పరీక్షకు అనుమతిస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవంబర్ 4 నాటికి మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు తప్పవా ??
వినియోగదారులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిన నిబంధనలు ఇవే!
అల్లు శిరీష్ నిశ్చితార్థం వేడుక ఫోటోలు వైరల్
