రైల్వే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్..ఎలాంటి రాత పరీక్షా లేదు వీడియో
భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం చూస్తున్న క్రీడాకారులకు శుభవార్త. ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2025-26 సంవత్సరానికి 56 స్పోర్ట్స్ కోటా పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టులకు రాత పరీక్ష లేదు. అభ్యర్థులు తమ క్రీడా ప్రతిభ, ట్రయల్స్, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయబడతారు. అక్టోబర్ 21, 2025లోపు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
భారతీయ రైల్వేలో ఉద్యోగాలు ఆశించే వారికి శుభవార్త. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2025-26 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటా కింద పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 స్పోర్ట్స్ కోటా పోస్టులను భర్తీ చేయనున్నారు. రెజ్లింగ్ (పురుషులు), బాస్కెట్బాల్ (పురుషులు, మహిళలు), కబడ్డీ (మహిళలు), ఫుట్బాల్ (మహిళలు), బ్యాడ్మింటన్ (మహిళలు), హాకీ (మహిళలు), క్రికెట్ (పురుషులు), వాలీబాల్ (పురుషులు) వంటి క్రీడా విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐ, అప్రెంటిస్షిప్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా, సంబంధిత క్రీడా విభాగంలో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ఉండాలి లేదా పతకాలు గెలుచుకుని ఉండాలి.
మరిన్ని వీడియోల కోసం :
