Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

Updated on: Jul 01, 2026 | 5:37 PM

న్యూస్ పేపర్లలో ఆహారం ప్యాక్ చేయడం క్యాన్సర్‌తో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రింటింగ్‌ ఇంక్‌లో ఉండే లెడ్, క్రోమియం, క్యాడ్మియం వంటి రసాయనాలు ఆహారంలో కలిసిపోయి జీర్ణ, కిడ్నీ, కాలేయ వ్యవస్థలను దెబ్బతీస్తాయి. ఆహార భద్రత కోసం ప్లేన్ పేపర్లు, టిష్యూ పేపర్లు, అరటి ఆకులు వంటి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు వాడాలని FSSAI సూచించింది.

ఇప్పటివరకు ప్లాస్టిక్ కవర్లలో ఆహారం ప్యాక్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భావించేవారు. అయితే, తాజా అధ్యయనాలు, నిపుణుల హెచ్చరికల ప్రకారం న్యూస్ పేపర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం కూడా అంతే ప్రమాదకరం. న్యూస్ పేపర్‌ ప్రింటింగ్‌ ఇంక్‌లో లెడ్, క్రోమియం, క్యాడ్మియం వంటి హానికరమైన హెవీ మెటల్స్‌తో పాటు మినరల్ ఆయిల్స్‌, ఆర్గానిక్ సాల్వెంట్స్ వంటి రసాయనాలు ఉంటాయి. వేడి, జిడ్డుగల లేదా తేమతో కూడిన ఆహారం ఈ ఇంక్‌తో కలిసినప్పుడు, అందులోని రసాయనాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల స్వల్పకాలికంగా జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఇన్ఫెక్షన్లు వంటివి తలెత్తుతాయి. దీర్ఘకాలికంగా ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే మినరల్ ఆయిల్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (MOAH) వంటి ప్రమాదకర రసాయనాలను విడుదల చేస్తుంది. ఇది కాలేయం, కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం

స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!

Bullet Train: హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!

Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

Loading...
Unable to load recommendations.
Follow Us