తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
తురకపాలెం నుండి తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆరు కేసులను కూడా గుంటూరు జిజిహెచ్ కి తరలించారు. గుంటూరు జిజిహెచ్ లో వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. అంటే ప్రాథమికంగా మెలియాడిస్ కేసులుగా అనుమానించి వాళ్ళందరికీ కూడా చికిత్స అయితే అందిస్తున్నారు. కానీ ముగ్గురికి మాత్రం పాజిటివ్ వచ్చింది. మరొక ముగ్గురికైతే ఇప్పటివరకు ఆ టెస్ట్ లో అయితే మెలియాడిసిస్ ఉన్నట్టుగా బయటపడలేదు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు మాత్రం ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు. మనతో పాటు సూపరింటెండెంట్ రమణ ఉన్నారు.
ఇవాళ ప్రధానంగా అందిస్తున్న చికిత్స కావచ్చు లేకపోతే మీరు చేసిన టెస్ట్ ల ఫలితాలు కావచ్చు ఇక్కడ ఉన్న ఆరుగురు పేషెంట్ల పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉన్నారు అని అడగ్గా, ఆయన మాట్లాడుతూ.. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులో ఆరుగురు పేషెంట్లు ఉన్నారు. వారిలో 12 ఏళ్ళ లోపు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారికి నెగిటివ్ వచ్చింది సిటి స్కాన్ చేసాం నెగిటివ్ వచ్చింది. వారికి నెగిటివ్ వచ్చనప్పటికీ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే వారు కూడా తురకపాలెం నుంచే వాచ్చారు. అందువలన వారిని అడ్మిట్ చేసాం. ఎందుకంటే, ప్రాణాంతకంగా ఉండటం వలన వారిపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాం. ఇద్దరు చిన్నపిల్లలు చక్కగా కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పుకొచ్చారు
మరిన్ని వీడియోల కోసం :
లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్ కపుల్.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో
ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో
