NTR డ్రాగన్ ఓటీటీ రిలీజ్‌ విషయంలో కీలక నిర్ణయం

Updated on: Oct 17, 2025 | 9:14 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ ఓటీటీ విడుదల విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమ్ చేయకూడదని నిర్ణయించారు. ఇది ఓటీటీ-థియేటర్ల మధ్య గ్యాప్ చర్చలో కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు థియేట్రికల్ రన్‌ను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు మధ్య కనీస గ్యాప్ ఉండాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ చర్చకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకు వేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం డ్రాగన్. ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన వారే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డ్రాగన్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డ్స్‌ను సృష్టిస్తుందని మేకర్స్ దృఢంగా నమ్ముతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విశాఖలో అతి పెద్ద ‘గూగుల్ ఏఐ హబ్’

ఒక్క రోజులోనే రూ.3,770 పెరిగిన బంగారం.. శుక్రవారం తులం బంగారం ఎంతంటే ??

శేషాచలంలో అరుదైన ప్రాణులు

అర్చనలు చేయాల్సిన పూజారి అడ్డదారిలో వెళ్లాడు.. చివరికి..

దీపావళి సెలవులు పొడిగింపు! తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా