విక్రమ్ సినిమాతో చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించారు. మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న కమల్.. తాజాగా ఆదివారం తన తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..