మహేష్ ఫ్యాన్స్ బీ రెడీ.. ముహూర్తం ఫిక్స్ చేసిన రాజమౌళి

Updated on: Oct 23, 2025 | 7:37 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి29 సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ రివీల్ కోసం రాజమౌళి ముహూర్తం ఫిక్స్ చేశారు. నవంబర్ 11 లేదా 15న హైదరాబాద్‌లో భారీ ప్రెస్ మీట్ ద్వారా టైటిల్‌తో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం ఎస్ఎస్ఎంబి29. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్క ప్రీ-లుక్ తప్ప మరే అధికారిక అప్‌డేట్ వెలువడలేదు. తాజాగా, దర్శకుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబి29 చిత్రం యొక్క బిగ్ రివీల్ కోసం ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ను మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ వేదికగా భారీ పబ్లిక్ ఈవెంట్ ద్వారా చిత్ర బృందం మేజర్ అప్‌డేట్స్‌ను అందించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దర్శకులతో విశాల్‌కు పడట్లేదా ?? మకుటం సినిమాను టేకోవర్ చేసిన తమిళ హీరో

రూ.700 పలుకుతోన్న కిలో టమోటా.. ఇంకేం తింటారు

తరుముకొస్తున్న వాయుగుండం.. పలు జిల్లాల్లో స్కూల్స్‌ బంద్‌

Gold Price Down: లక్ష దిగువకు బంగారం.. ఇదీ అసలు కారణం

దీపావళి బోనస్ ఇవ్వలేదని టోల్ గేట్లు ఎత్తేసారు !! రూ. లక్షల్లో నష్టం