2027 పొంగల్ ను టార్గెట్ చేసిన నలుగురు సీనియర్స్.. పోటీతో బాక్సాఫీస్కు నష్టాలా ??
2027 సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి నలుగురు సీనియర్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది అభిమానులకు పండగే అయినా, ఒకేసారి నలుగురు వస్తే బాక్సాఫీస్కు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ఫ్యాన్ వార్స్కు ఇది దారితీసే అవకాశం ఉంది.
2027 సంక్రాంతి పండుగ సినీ అభిమానులకు డబుల్ ధమాకాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్ర తారలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నలుగురు సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలోకి దిగితే అభిమానులకు పండగే అవుతుంది. అయితే, దీని వల్ల లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీనియర్ హీరోలకు సంక్రాంతికి రావడం అలవాటు. గత సంక్రాంతికి చిరంజీవి, వెంకటేష్ చిత్రాలు పోటీపడ్డాయి. ఇప్పుడు 2027 సంక్రాంతికి కూడా ఈ సెంటిమెంట్ కొనసాగేలా ఉంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే జనవరి 15న విడుదలకు ఖరారు కాగా, బాలకృష్ణ – విజయ్ కనకమేడల, చిరంజీవి – బాబీ చిత్రాలు కూడా పండగనే లక్ష్యంగా చేసుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnupriya: విష్ణుప్రియపై ఫిర్యాదు.. మరోసారి వివాదంలో చిక్కుకున్న యాంకర్
బంగారం లాంటి అవకాశాలను చేజార్చుకున్న టాలీవుడ్ దర్శకులు
ముంచేస్తున్న IPL.. భయపడుతున్న మేకర్స్
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్!
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్.. ఆ తర్వాత

