ప్రభాస్‌ దెబ్బకు అరవ హీరో సైలెంట్ అవుతాడా ??

Updated on: Sep 03, 2025 | 5:12 PM

నిన్న మొన్నటి వరకు డైలామాలో ఉన్న రాజాసాబ్ ఫ్యాన్స్‌ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. రాజా సాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ అనౌన్స్‌మెంట్‌ నేపథ్యంలో తమ స్టార్ హీరో దెబ్బకి అరవ హీరో విజయ్‌ దళపతి సైలెంట్ అవ్వాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. తమ ఆదిపత్యాన్ని తమ కామెంట్స్‌ రూపంలో సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు.

ఇక మారుతీ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ రాజాసాబ్..! ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా ఎట్టకేలకు జనవరి 9న రిలీజ్‌ అవుతుందని ఈ మూవీ ప్రొడ్యూసర్‌ రీసెంట్‌గా అనౌన్స్‌ చేశారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ను ఖుషీ అయ్యేలా చేశాడు. అయితే హెచ్ వినోడ్ డైరెక్షన్లో విజయ్‌ దళపతి చేస్తున్న లాస్ట్ ఫిల్మ్ .. జననాయగన్ కూడా జనవరి 9న రిలీజ్ అవుతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర విజయ్‌ దళపతి.. ప్రభాస్‌ మధ్య బిగ్ ఫైట్ జరిగేలా ఉంది. ఈక్రమంలోనే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ..కాస్త యాక్టివ్ అయ్యారు. టాలీవుడ్‌ లో తమ హీరోను కొట్టేంత సీన్‌ తళపతికి లేదంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు కోలీవుడ్‌ మినహా రిమైనింగ్ పాన్ ఇండియా ఇండస్ట్రీస్‌లోనూ తమ హీరోదే పై చేయి సాధిస్తాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ ఫిల్మ్ అనలిస్టులు కూడా దాదాపు ఇదే చెబుతున్నారు. ఈ సారి టాలీవుడ్‌ గడ్డపై ప్రభాస్‌ దెబ్బకు అరవహీరో సైలెంట్ అవడం పక్కా అని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నా కొడుకు కాలు విరిగింది..! అంత బాధలోనూ నా జున్ను ఆ మాట అన్నాడు..

వాహనదారులకు గుడ్‌ న్యూస్‌..

Kannappa: ఎట్టకేలకు OTTలోకి కన్నప్ప మూవీ..! విష్ణు తెలివే వేరబ్బా..!

సినిమా చేస్తే సరిపోతుందా? ప్రమోషన్స్‌కి డుమ్మా కొడితే ఎలా? అనుష్క తీరుపై విమర్శలు

రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో లేడీ ప్రొఫెసర్‌కు వేధింపులు