AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు

ఓ పక్క యుద్ధ పరిస్థితులంటే ఇంకో పక్క పాకిస్తానీతో దోస్తీనా..! ఛీ సిగ్గు చేటు

Phani CH

|

Updated on: May 01, 2025 | 3:51 PM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పై ఆగ్రహం పెల్లుబికింది. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఎలాగైనా మట్టుబెట్టాలని కోరుకుంటున్నారు దేశప్రజలు. మరోవైపు కేంద్రం కూడా ఈ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అటు భారత్ , పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంటోంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో.. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు ఓ పాకిస్తానీతో దోస్తీనే ఎక్కువైంది.

అదే ఇప్పుడు ఈమెపై అందరూ విరుచుపడేలా.. తిట్టేలా చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. కరీనా కపూర్ ఇటీవల ఒక కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లింది. అక్కడ ఆమె ప్రముఖ పాకిస్తానీ ఫ్యాషన్ డిజైనర్ ఫరాజ్ మన్నన్‌ను కలిసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ ఫోటో కాస్తా క్షణాల్లో వైరల్ అయింది. దాంతో పాటే ఇండియన్స్‌ నుంచే కాదు.. ఆమె ఫ్యాన్స్‌ నుంచి కూడా ఊహించని రియాక్షన్ ఎదురవుతోంది ఈ బెబోకి. ఇక ఈ ఫోటోపై ఇండియన్స్‌ సోషల్ మీడియాలో సీరియస్ అవుతున్నారు. ఓ పక్క పాకిస్తానీలను దేశం నుంచి వెళ్లగొడుతుంటే.. కరీనా కపూర్ మాత్రం దుబాయ్‌ వెళ్లి మరీ పాకిస్తానీని కలవడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న ఈ టైంలో.. పాకిస్తానీని కరీనా కలవడాన్ని తప్పుబడుతున్నారు. ఛీ సిగ్గు చేటు అంటూ తీవ్రంగా కరీనాను తిడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేకప్‌ రూమ్‌కి పిలిచి మరీ.. గోపీచంద్‌కు క్లాసు పీకిన చిరు..!

ఉగ్రదాడిపై హీరో పాజిటివ్ పోస్ట్‌.. దారుణంగా తిట్టిన ఇండియన్స్‌.. దెబ్బకు యూటర్న్‌

మా హీరోను అన్నావ్ సరే.. మరి నీకేం తెలుసు బోడి