నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

Updated on: Oct 08, 2025 | 5:25 PM

మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ రూ. 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి రూ. 26.27 కోట్లు అధికంగా వసూలు చేసిందని గుర్తించి, వాటిని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ అనుమతి రద్దు చేయాలని సిఫార్సు చేయగా, ఈ ఆదేశాలపై ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

నటుడు మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినందుకు గాను ఏకంగా 15 లక్షల రూపాయల జరిమానా పడింది. అంతేకాకుండా, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల 27 లక్షల రూపాయలను తిరిగి చెల్లించాలని ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్ ఆదేశాల ప్రకారం, యూనివర్సిటీ అనుమతిని, గుర్తింపును రద్దు చేయాలని కూడా సిఫార్సు చేయడం జరిగింది. అయితే, ఉన్నత విద్యా కమిషన్ జారీ చేసిన ఈ ఆదేశాలపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోకిరీల ఓవరాక్షన్‌.. చార్మినార్‌ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర కామెంట్లు

Dhanush: సొంతూరులో ధనుష్ సందడి.. గ్రామస్తులకు నాన్‌ వెజ్‌ విందు

మన టాప్ 10 యూట్యూబర్లు వీరే.. వందల కోట్లలో సంపద

TGSRTC: మరింత స్మార్ట్‌గా తెలంగాణ ఆర్టీసీ.. త్వరలో గూగుల్‌ మ్యాప్స్‌తో అనుసంధానం

ఐటీ రిఫండ్ ఇంకా మీ ఖాతాలో పడలేదా