స్టైల్ మార్చిన అందాల భామలు

Edited By:

Updated on: Mar 28, 2026 | 11:35 AM

సినిమాలతో సంబంధం లేకుండా హీరోయిన్లు గ్లామరస్ లుక్స్‌తో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా శృతి హాసన్, కీర్తి సురేష్, నయనతార వంటి నటీమణులు స్లిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌తో పాన్ ఇండియా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాలో వారి స్టైల్, మేకోవర్‌లు హాట్ టాపిక్ అయ్యాయి. జూనియర్స్‌తో పోటీ పడటానికి, ఆడియన్స్‌కు చేరువ కావడానికి ఈ ప్రయత్నం మంచి స్పందన పొందుతోంది.

సినిమాలతో సంబంధం లేకుండా హీరోయిన్ల గ్లామరస్‌ లుక్స్‌ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య చాలా మంది హీరోయిన్లు స్లిమ్ లుక్‌లోకి మారిపోతున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలు కవర్ చేయాలంటే.. ఆ మాత్రం కష్టపడక తప్పదని ఫీల్ అవుతున్నారు అందాల భామలు. రీసెంట్‌ టైమ్స్‌లో సినిమాల నెంబర్‌ తగ్గించినా… సోషల్ మీడియా ప్రెజెన్స్ మాత్రం శృతి హాసన్‌ యాక్టివ్‌గానే ఉన్నారు. ముఖ్యంగా ఈ బ్యూటీ మేకోవర్‌ గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో కీర్తి సురేష్‌ లుక్‌ మీద కూడా అదే స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. బాలీవుడ్ డెబ్యూ తరువాత ఈ బ్యూటీ గ్లామర్ షో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంది. జూనియర్స్‌తో పోటి పడాలంటే తాను కూడా స్టైల్ మార్చేసిందే అని డిసైడ్ అయ్యారు సీనియర్ బ్యూటీ నయనతార. అందుకే సోషల్ మీడియా ప్రెజెన్స్ పెంచటంతో పాటు లుక్ విషయంలోనూ స్పెషల్ కేర్‌ తీసుకుంటున్నారు. బాలీవుడ్ మీద కూడా ఫోకస్ చేస్తున్న ఈ భామ స్లిమ్ లుక్‌లో షాకిస్తున్నారు. సక్సెస్‌ ట్రాక్‌లో లేకపోయినా రాశీ ఖన్నా, భాగ్యశ్రీ బోర్సే, కృతి శెట్టి నయా లుక్స్‌తో టాలీవుడ్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నారు. నార్త్ భామలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో ఈ బ్యూటీస్‌ చేస్తున్న గ్లామర్ షో మీద ఫిలిం నగర్‌లో చర్చ జరుగుతోంది. సినిమాలతో సంబంధం లేకుండా అందాల భామలు చూపిస్తున్న జోరుకు ఆడియన్స్‌ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: డోంట్ కేర్.. నేను ఫుల్ క్లారిటీ తో ఉన్న అంటున్న డార్లింగ్

సేఫ్ జోన్ వదిలి.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు

ఆ సంగీత దర్శకులకు స్పెషల్ క్రేజ్.. ఎందుకో తెలుసా

Follow Us