చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం

Updated on: Oct 17, 2025 | 4:55 PM

బిగ్ బాస్ హౌస్‌లో.. కొందరు ఫిజికల్ టాస్కులు నమ్ముకుంటే.. మరి కొందరు బాండ్స్‌ను నమ్ముకుంటారు. ఇంకొందరూ మైండ్ గేమ్‌తో ఆటలో ముందుకు వెళుతుంటారు. కానీ సీజన్‌9లోకి స్టార్ కంటెస్టెంట్‌ గా ఎంట్రీ ఇచ్చిన సంజన మాత్రం దొంగతనాలతో.. ప్రాంకులతో హౌస్‌లో అందరికీ చికాకు తెప్పిస్తున్నారు. ఇక ఇప్పుడు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన మాధురి కూడా ఆమెతో చేతులు కలిపి బొట్టు బిళ్ల ప్రాంక్‌తో అందర్నీ అవాక్కయ్యేలా చేశారు.

ఈ కారణంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్‌కు కేరాఫ్‌ గా మారిపోయారు. రీసెంట్ ఎపిపోడ్‌… 39th ఎపిసోడ్‌లో సంజన అండ్ మాధురి కలిసి.. హౌస్‌లోని అందరిపై ఓ ప్రాంక్‌ను ప్లాన్ చేశారు. బొట్టు బిళ్ల మిస్సైందని తాను .. నేను దొంగిలించలేదని తాను గొడవ పడాలంటూ.. మాధురి- సంజన మాట్లాడుకుని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసినట్టే ఇంప్లిమెట్ కూడా చేశారు. ఆ ప్రాంక్‌లో భాగంగా .. మాధురి- సంజన, ఇద్దరూ గట్టిగానే పొట్లాడుతున్నారు. అయితే మాధురి వాయిస్‌ను.. గడుసు తనాన్ని బరించలేక సంజన గివ్‌ అప్ ఇచ్చేసి.. అక్కడే ఇదంతా ప్రాంక్ అంటూ చెప్పారు. అయితే అప్పటి వరకు వీరి గొడవను సీరియస్‌గా చూస్తూ సైలెంట్‌గా కూర్చున్న కంటెస్టెంట్స్ అందరూ.. వీరిద్దరి గొడవ ప్రాంక్ అని తెలియగానే నోరెళ్ల బెట్టారు. ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే బిగ్ బాస్‌ కూడా వీరి గొడవకు హైలెట్ చేస్తూ ప్రోమో రిలీస్ చేశాడు. అయితే ఈ గొడవ నిజం అనుకున్న బీబీ ఫ్యాన్స్‌.. తీరా ఫుల్ ఎపిసోడ్‌ చూశాక. షాకయ్యారు. బిగ్ బాస్‌ తమను మిస్ లీడ్ చేశాడంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. దాంతో పాటే సంజన – మాధురి తీరును విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో

ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి

మమిత – క్రికెటర్‌ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??

వీళ్లవి నోళ్లు కాదు మైకు సెట్లు.. రీతూ – ఆయేషా గొడవతో.. అందరికీ తలనొప్పి

Mithra Mandali: చాలా కష్టపడి నవ్వాలి! హిట్టా..? ఫట్టా..?