అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్

Updated on: Oct 06, 2025 | 9:35 PM

1980వ దశకంలో సినీ ఇండస్ట్రీలో మెరిసిన తారలు మళ్ళీ కలిశారు. ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటులు కలయిక ఎప్పట్నుంచో సాంప్రదాయంగా వస్తోంది. తమ దశాబ్దాల నాటి స్నేహాన్ని, అలాగే ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ మీట్‌కి ఈ ఏడాది కూడా తారలు తరలి వచ్చారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్ట‌రీ వెంక‌టేశ్, న‌రేష్ త‌దిత‌రులు హాజ‌రుకాగా.. ఇతర ఇండ‌స్ట్రీల నుంచి ప‌లువురు స్టార్ న‌టులు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

ఇక అందరూ క‌లిసి ఒకే డ్రెస్ కోడ్‌లో హాజ‌ర‌యిన‌ట్లు ఫొటోలు చూస్తే అర్థ‌మ‌వుతుంది. అయితే ఈ వేడుక‌పై చిరంజీవి ఎక్స్ వేదిక‌గా ప్ర‌త్యేక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సదరు ఫోటోలను మెగాస్టార్‌ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి… ‘నా ప్రియమైన స్నేహితులతో ప్రతీ రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతే. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలే. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిది’అని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తంచేశారు. చెన్నైలో వరదల కారణంగా గతేడాది వాయిదా పడగా, తాజాగా అక్టోబరు 4న దక్షిణాది, ఉత్తరాదికి చెందిన మొత్తం 31 మంది కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. దీనిపై.. చిరంజీవి ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకుంటూ.. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది.. ప్రతిసారీ.. ఈ మీట్.. మొదటి సమావేశంలానే అనిపిస్తుందని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, శరత్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, నరేశ్‌, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు పాల్గొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి

Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్‌.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు

US Army Beard Ban: సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం

Rohit Sharma: రోహిత్‌ శర్మకు ఊహించని షాక్

New Traffic Rules: వాహనదారులకు ఇక దబిడి దిబిడే.. కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ ఇవే!