కుళ్ళిన మాంసంతో నూనె దందా.. ఎవరా ముఠా

Updated on: Feb 05, 2026 | 9:04 PM

గోదావరి జిల్లాల్లో కుళ్ళిన మాంసం, జంతువుల కళేబరాల నుండి తీసిన కొవ్వుతో కల్తీ నూనె దందా బయటపడింది. ఏలూరు విజిలెన్స్ దాడుల్లో ఈ ప్రాణాంతక వ్యాపారం గుట్టు రట్టైంది. క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమయ్యే ఈ నూనెను రెస్టారెంట్లు, చిరుతిళ్ల దుకాణాలకు అమ్ముతున్న కేటుగాళ్లను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

గోదావరి జిల్లాల్లో ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రమాదంలో పడేస్తున్న ఒక దారుణమైన కల్తీ నూనె దందా వెలుగులోకి వచ్చింది. పాత నూనెను పదేపదే వాడితే క్యాన్సర్ వస్తుందంటే, ఇప్పుడు కుళ్ళిన మాంసం, జంతువుల కళేబరాల నుంచి తీసిన కొవ్వుతో నూనె తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతుండటం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పశువులను వధించి, వాటి మాంసాన్ని ఉడికించి తీసిన కొవ్వును కరిగించి నూనెగా మార్చి అమ్ముతున్నారని ఏలూరు విజిలెన్స్ టీమ్‌ల దాడుల్లో వెల్లడైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం

CM Chandra Babu: మీరు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారు ఏంటి?

KCR: గజ్వేల్ మా ఇలాకా.. చూపిస్తాం మా తడాఖా

Varanasi: వారణాసి డ్యూరేషన్‌ రివీల్ చేసిన జక్కన్న.. బాబోయ్ మరీ అన్ని గంటలా !

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు