Eluru: చేపలను పట్టే పండగ.. ఇదే ఆ ఊరు ప్రత్యేకం

|

Nov 09, 2023 | 8:46 PM

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో చేపల పండుగను జాతరలా జరుపుతారు. ఏడాదిలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి ఊర చెరువు వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి చెరువులో దిగి చేపలను వేటాడతారు. అలా వేటాడిన చేపలన్నింటినీ చెరువు గట్టుపై ఓ పెద్ద కుప్పగా పోస్తారు. వేట ముగిశాక చెరువులోని వారందరూ బయటకు వచ్చి ఆ చేపలను సమాన భాగాలుగా చేసుకుని ఊరంతా కలిసి పంచుకుంటారు.

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో చేపల పండుగను జాతరలా జరుపుతారు. ఏడాదిలో ఒక రోజు గ్రామస్తులంతా కలిసి ఊర చెరువు వద్దకు చేరుకుంటారు. అందరూ కలిసి చెరువులో దిగి చేపలను వేటాడతారు. అలా వేటాడిన చేపలన్నింటినీ చెరువు గట్టుపై ఓ పెద్ద కుప్పగా పోస్తారు. వేట ముగిశాక చెరువులోని వారందరూ బయటకు వచ్చి ఆ చేపలను సమాన భాగాలుగా చేసుకుని ఊరంతా కలిసి పంచుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం ఆ చెరువులో చేపలు పుష్కలంగా దొరుకుతాయి. గోదావరి నదికి వరద వచ్చిన సమయంలో ఊర చెరువు సైతం ఆ ఉధృతికి మునిగిపోతుంది.. అయితే అంత ఉధృతిలో కూడా అందులోని చేపలు గోదావరి నదిలో కొట్టుకు వెళ్ళిపోకుండా ఉంటాయని గిరిజనులు విశేషంగా చెబుతారు. చేపల వేట రోజున మాత్రం ఎవరు ఏ పని ఉన్నా ఎక్కడికీ వెళ్లరు. విధిగా కార్యక్రమంలో గిరిజనులందరూ హాజరవుతారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెత్త ఏరుకునే వ్యక్తికి దొరికిన బ్యాగ్‌ !! తెరిచి చూడగా 30 లక్షల డాలర్లు

Follow us on