Nagarkurnool Floods : భార్య ఆత్మహత్యాయత్నం.. ఆమెను కాపాడేందుకు వరద నీట్లో దూకిన భర్త.. తర్వాత

Updated on: Aug 29, 2025 | 12:14 PM

నాగర్ కర్నూల్‌లోని కేసరి సముద్రం చెరువు వద్ద వరదల్లో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేయగా, ఆమెను కాపాడేందుకు భర్త కూడా నీటిలో దూకాడు. ఇద్దరూ కొట్టుకుపోతుండగా, స్థానికులు వారిని రక్షించారు. భర్త తన భార్యను గట్టిగా పట్టుకుని ఉండటం వలన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు ఉప్పొంగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసరి సముద్రం చెరువు దగ్గర పారుతున్న వరదలోకి ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కాపాడేందుకు ఆమె భర్త కూడా వరదనీటిలో దూకాడు. వరద ఉద్ధృతికి ఇద్దరూ కొట్టుకుపోతున్నారు. అప్రమత్తంగా ఉన్న స్థానికులు వారిద్దరినీ రక్షించారు. ఈ ఘటన చుట్టుపక్కల వారిని షాక్‌కు గురిచేసింది. వరద ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చాటుతుంది.