ఫారిన్ స్టూడెంట్స్ కి ట్రంప్ కొత్త మెలిక వీడియో
అమెరికాలో విదేశీ విద్యార్థులను ఉద్దేశించి ట్రంప్ పరిపాలన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ నిధులను షరతులతో కూడినది, విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితులు విధించింది. అడ్మిషన్ల కోసం ప్రామాణిక పరీక్షలను తప్పనిసరి చేసింది. క్యాంపస్లలో రాజకీయ ప్రదర్శనలు, ఉద్యోగుల ప్రసంగాలపై ఆంక్షలు విధించింది.
ట్రంప్ పరిపాలన అమెరికాలో విదేశీ విద్యార్థులు, యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుని కొత్త నిబంధనలను అమలు చేస్తోంది. హెచ్1బి వీసా ఫీజులను పెంచిన తర్వాత, వైట్ హౌస్ ఇప్పుడు ప్రముఖ యూనివర్సిటీలకు మెమో జారీ చేసింది. ప్రభుత్వ నిధులు పొందాలంటే వర్సిటీలు కొన్ని షరతులు పాటించాలని స్పష్టం చేసింది. విదేశీ విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించకూడదని, ఒకే దేశం నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య ఐదు శాతానికి మించరాదని ఆదేశాలు వెళ్లాయి. అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులకు ఎస్ఏటి లేదా ఏసిటి వంటి ప్రామాణిక పరీక్షలు తప్పనిసరి. విదేశాల నుంచి అందే నిధుల వివరాల్ని బహిర్గతం చేయాలి.
మరిన్ని వీడియోల కోసం :
