ఆ ఎమ్మెల్యే.. రూటు మార్చారా..? గేరు మార్చారా? వీడియో

Updated on: Sep 27, 2025 | 12:14 PM

అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గతంలో అనేక వివాదాలతో సతమతమయ్యారు. రేషన్ షాపులు, మధ్యం దుకాణాల టెండర్లు, ఇతర అంతర్గత రాజకీయ రచ్చలతో ఆయన వార్తల్లో నిలిచారు. అయితే, ఇటీవల ఆయన తన వ్యూహాన్ని మార్చుకుని, డామేజ్ కంట్రోల్‌కు శ్రీకారం చుట్టారు. బహిరంగ సభ విజయవంతం కావడంతో పార్టీ అధిష్టానం దృష్టిలో సానుకూల మార్కులు సంపాదించారు.

అనంతపురం జిల్లా రాజకీయాల్లో అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గత కొన్నాళ్లుగా అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి రేషన్ షాపుల కేటాయింపు, మధ్యం దుకాణాల టెండర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ పోస్టుల వంటి పలు అంశాలపై ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రపన్నారన్న ఆరోపణలు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో అంతర్గత ఘర్షణలు ఆయన ప్రతిష్టను దెబ్బతీశాయి.

మరిన్ని వీడియోల కోసం :

టచ్‌ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో

సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్‌ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి

రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో

దటీజ్‌ ఎన్టీఆర్‌.. గాయలతోనే షూటింగ్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us