Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ.. 200 మంది వరలక్ష్మీ వ్రతాలు

Updated on: Aug 30, 2024 | 12:42 PM

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు. కాగా, 200 మంది మహిళలు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రత క్రతువులో పాల్గొన్నారు. వ్రతం పూర్తి చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు మహిళా భక్తులు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులరద్దీ కొనసాగుతోంది. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులుతీరారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో భాస్కర్ రావు. కాగా, 200 మంది మహిళలు ఈ సామూహిక వరలక్ష్మీ వ్రత క్రతువులో పాల్గొన్నారు. వ్రతం పూర్తి చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు మహిళా భక్తులు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us