అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన

Updated on: Nov 06, 2025 | 4:00 PM

ఛత్తీస్‌ఘడ్‌లో ఆహారం కోసం అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఓ రెండు ఏనుగులు, తమ రెండు పిల్లలతో సహా ఓ బావిలో పడిపోయాయి. దీనిని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు రంగంలోకి దిగి..ఆ ఏనుగులను రక్షించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఏనుగుల రెస్క్యూ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బర్నవాపారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం సమీపంలోని హార్దీ గ్రామంలోకి ఓ నాలుగు ఏనుగులు వచ్చాయి. ఆహారం ఎకోసం వెతుకుతూ వచ్చిన ఆ ఏనుగులు ప్రమాదవశాత్తు ఓ ఓపెన్ బావిలో పడిపోయాయి. ఏనుగుల ఆక్రందనలు విని ఏమై ఉంటుందా అని అక్కడకు వచ్చిన స్థానికులకు గమనించిన స్థానికులు బావిలో సాయం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయ స్థితిలో నాలుగు ఏనుగులు కనిపించాయి. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఏనుగులను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. అటవీ ప్రాంతాల్లో ఓపెన్ బావులను పూడ్చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీచర్లు కాదు.. రాక్షసులు.. బాలుడి ప్యాంటులో తేలును వదిలి ..

ట్యూషన్‌ నుంచి ఇంటికి వస్తున్న బాలుడు..ఊహించని విధంగా

పంట నష్టం కింద రైతుకు పరిహారంగా రూ.2.30

భారీ షాక్‌‌లో డొనాల్డ్ ట్రంప్.. స్వయంగా ప్రచారం చేసినా ఓటమి

పిల్లలను తినేస్తున్న పులి.. పాపం చిన్నారి